calender_icon.png 21 October, 2024 | 5:11 AM

ఇండియాలో విడుదలకు సిద్ధం

21-10-2024 12:45:44 AM

ముంబైలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు కేరళ నర్స్‌ల నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటన ఆధారంగా తెరకెక్కిన రూపొందిన చిత్రం ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ సినిమాలో కనికా కస్రుతి, దివ్యప్రభ లీడ్స్ రోల్స్ నటించగా, ఛాయా కందం ఓ కీలక పాత్ర పోషించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలకు చెందిన చిత్ర నిర్మాణ సంస్థలు నిర్మించారు.

ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై, గ్రాండ్ ప్రీ అవార్డును సొంతం చేసుకుందీ సినిమా. 97వ ఆస్కార్ పురస్కారోత్సవాల్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించిన సినిమాల జాబితాలోనూ చోటు దక్కించుకుంది. అయితే, ఈ సినిమా ప్రస్తుతం ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ హీరో, నిర్మాత రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా దీన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.