సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వ్యవస్థాపితమై ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయింది. ఈ బ్యానర్లో తెరకెక్కించిన ఎన్నో మరుపు రాని చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాది ప్రత్యేక స్థానం. ఈ ప్రొడక్షన్ హౌస్ అర్ధ శతాబ్ది వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో వచ్చే నెలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఇంద్ర’ సినిమాను రీ రిలీజ్ చేయటం ద్వారా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపాలని నిర్ణయించారు వైజయంతి మూవీస్ వ్యవస్థాపకుడు అశ్వనీ దత్.
ఈ మేరకు ‘ఇంద్ర’ను ఆగస్టు 22న మరోమారు ప్రేక్షకుల ముందుకు తీసుకొ స్తున్నారు. 2002, జూలై 24న విడుదలైన ‘ఇంద్ర’ అప్పట్లో అత్యధిక వసూ ళ్లు సాధించిన దక్షిణాది సినిమాగా నిలిచింది. అంతేకాక ఈ చిత్రానికి మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు గెలుచుకుంది. చిరంజీవికి ఉత్తమ నటుడు కేటగిరిలో నంది అవార్డు దక్కగా, తెలుగు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ అవార్డు సైతం వరించింది.