నల్లగొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ సదరన్ పవ ర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) నల్లగొండ జిల్లా ఇన్చార్జి ఎస్ఈగా యాదాద్రి భువనగిరి జిల్లా డీఈ రవిప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రే ఆయన బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ ఎస్ఈ పౌల్రాజుపై ప్రొటోకాల్ ఉల్లంఘన ఆరోపణ నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.