64 మంది అరెస్టు
మైసూరు, సెప్టెంబర్ 29: మైసూరులో కర్ణాటక పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ ఘటనలో 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వస్తున్నారని తెలిసి కొందమంది పారిపోయేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. నిందితులకు చెందిన వాహనాలను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు మైసూరు ఎస్పీ సమాచారం అం దించారు. దీనిపై స్పందించిన సీఎం చట్ట ప్రకారం నిందితులపై కఠిన చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.