హైదరాబాద్: నార్సింగి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), ఎక్సైజ్ శాఖ అధికారుల సహకారంతో హైదరాబాద్ శివార్ల జన్వాడలో ఫామ్హౌస్పై అక్టోబర్ 27 తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ జరిగింది. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వహకులు 35 మందితో మద్య పార్టీ నిర్వహించారు.
ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాలా కేటీఆర్ బావమరిదిగా గుర్తించారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో ఎన్ డీపీఎస్ యాక్ట్ కింది కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం సహా భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద మరో కేసు నమోదు చేశారు పోలీసులు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం, క్యాసినో నిర్వహించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ స్వాధీనం చేసుకున్నారు. భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ 30 ఎకరాల్లో విస్తరించి ఉంది.