calender_icon.png 7 February, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్

06-02-2025 11:07:30 PM

ఖమ్మం (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని ఉపేందర్ అనే వ్యక్తి ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పౌరసరఫరాల అధికారులు గురువారం దాడి చేసి, 17 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.