calender_icon.png 17 March, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం పట్టివేత

16-03-2025 10:09:14 PM

పెద్ద అంబర్ పేటలో గోదాం సీజ్ చేసిన హయత్ నగర్ పోలీసులు...

ఎల్బీనగర్: పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా రేషన్ బియ్యం నిల్వ చేసిన గోదాం పై దాడి చేసి, బియ్యం స్వాధీనం చేసుకున్నారు. హయత్ నగర్ పోలీసులు తెలిపిన వివరాలు... హయత్ నగర్ కి చెందిన పెట్రోలింగ్ పోలీసులు ఆదివారం పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో గస్తీ నిర్వహిస్తున్నారు. పెద్ద అంబర్ పేట నుంచి మునగనూరు వెళ్లే దారిలో ఒక పాత గోదాం ఎదుట లారీలో (TS3T5049) ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పీడీఎస్ రైస్ లోడ్ చేస్తున్నారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే హయత్ నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డి, డ్రైవర్ సురేశ్ అక్కడికి వెళ్లి, తనిఖీ చేశారు. అప్పటికే లారీలో 30 టన్నుల పీడీఎస్ రైస్  లోడ్ చేశారు. ఈ సందర్భంగా  పెద్దపల్లి జిల్లా సుల్తాన్ బాగ్ కు చెందిన డ్రైవర్ రేకుల శివకుమార్(22), బియ్యం సేకరించిన హయత్ నగర్ లోని అంబేద్కర్ నగర్ కు కాట్రోతు తిరుపతి(37)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లారీని సీజ్ చేశారు. పెద్ద అంబర్ పేటలోని పాడుపడిన గోదాంలో నిల్వ చేసిన 6 నుంచి 7 టన్నుల పీడీఎస్ రైస్ ను గుర్తించారు. ఈ మేరకు అట్టి గోదాంకు తాళం వేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించినట్లు హయత్ నగర్ పోలీసులు తెలిపారు.