calender_icon.png 10 October, 2024 | 5:28 PM

వెంకటాపూర్ లో రేషన్ బియ్యం పట్టివేత..

10-10-2024 03:13:04 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): కన్నేపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల (పిడిఎస్) రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు కన్నేపల్లి ఎస్సై గంగారాం తెలిపారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సయ్యద్ జావిద్ అనే వ్యక్తి కన్నెపల్లి మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన ఇందూరి లక్ష్మణ్ అనే వ్యక్తి దగ్గర రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి టి ఎస్ 19 టి ఎ 6503 నెంబరు గల వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు.