13-03-2025 12:39:45 AM
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, మార్చి 12: అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం చేవెళ్ల మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా దశలవారీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎంతమంది అర్హులు ఉంటే అన్ని కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు మర్పల్లి కృష్ణారెడ్డి, బండారి ఆగిరెడ్డి, పడాల జనార్దన్, తహసీల్దార్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.