నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఉత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వాములను పల్లకిపై ఊరేగింపు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రాహ్మణ సంఘం నాయకులు కర్ర పారిశ్రామిక సంఘం నాయకులు పాల్గొన్నారు.