ముంబై: ప్రజల సందర్శనార్థం రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని ఎన్ సీపీఏ గ్రౌండ్ కు తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముంయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా రాత్రి తుదిశ్వాస విడిచారు. అటు మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా మృతి పట్ల సంతాప దినం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తరుపున అంత్యక్రియలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.