calender_icon.png 10 October, 2024 | 8:50 PM

రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి

10-10-2024 05:52:48 PM

ముంబయి,(విజయక్రాంతి): ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబయి ఎన్సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లి శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించి,  అధికారిక లంఛనాలతో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ టాటా మరణించారు.