ముంబయి: కాసేపట్లో రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముంబయి వర్లి స్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలాలో చేస్తున్నారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. రతన్ టాటా మృత పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం సంతాపదినం ప్రకటించింది. ఆయన మృతి పట్ల వ్యాపార, రాజకీయ, సినీప్రముఖులు నివాళులర్పించారు. రతన్ టాటా పార్థివదేహానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ నివాళులర్పించారు. నటుడు అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇది దేశానికి విచారకరమైన రోజు. దేశానికి రతన్ టాటా అందించిన సహకారం వెలకట్టలేనిది. మేమంతా ఆయనను చాలా మిస్ అవుతాని పేర్కొన్నారు