calender_icon.png 5 October, 2024 | 6:54 PM

కేవీలో రాష్ట్రీయ ఏక్తా పర్వ్

05-10-2024 12:05:15 AM

కార్వాన్, అక్టోబర్ 4: నానల్‌నగర్‌లోని గోల్కొండ కేవీ-2లో రాష్ట్రీయ ఏక్తా పర్వ్ కళా ఉత్సవ్ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. గచ్చిబౌలి క్లస్టర్‌కు చెం దిన 9 కేంద్రియ విద్యాలయాల (కేవీ) విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా వీఎంసీ(విద్యాలయ మెంబర్ చైర్మన్) బ్రిగేడియర్ సంజ య్ వీ కులకర్ణి హాజరయ్యారు.

కార్యక్రమం లో భాగంగా ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చాలని సూ చించారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీల్ శర్మ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.