బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియాభట్ పై రష్మిక మందన ప్రశంసలు కురిపించింది. జిగ్రాలో ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉందని చెప్పింది. అలియాభట్, వేదాంగ్ రైనా ముఖ్యపాత్రల్లో నటించిన జిగ్రా సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ వారం ప్రారంభంలో ముంబైలో జరిగిన బాలీవుడ్ స్టార్ అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్ జిగ్రా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులలో నటి రష్మిక మందన్న కూడా ఉన్నారు. నటి రష్మిక మందన్న అలియా భట్, వేదంగ్ రైనా జిగ్రాను ప్రశంసిస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీని పంచుకుంటూ మొత్తం టీమ్ కృషికి ప్రశంసించింది.