28-03-2025 08:48:29 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్(Bar Association President Raparthi Ravinder) అన్నారు. అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైయిన సందర్భంగా గురువారం తన నివాసంలో న్యాయవాదులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు, బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పి.రాజీవ్ రెడ్డి, మంతెన రామకృష్ణ, చంద్రకుమార్, గణపతి తదితరులు పాల్గొన్నారు.