08-04-2025 04:40:16 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ లోని అహ్మద్ బీఎడ్ కళాశాలలో మంగళవారం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు సమాజంలో ఉన్న స్థితిగతులు, సామాజిక అంశాలు, ప్రతిబింబించేలా ముగ్గులు వెయ్యడం జరిగింది. ముగ్గులు వేసిన ఛాత్రో ఉపాధ్యాయులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి హనీఫ్ పాషా అభినందించడం జరిగింది. కళాశాల బోధన సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.