calender_icon.png 27 October, 2024 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీని అడ్డగించిన రంగయ్యపల్లి గ్రామస్తులు

28-08-2024 11:39:21 AM

ముత్తారం,(విజయక్రాంతి): రోడ్డుపై నీళ్లు కొడుతలేరని దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహంతో బుధవారం ముత్తారం మండలంలోని రంగయ్యపల్లి గ్రామస్తులు ఇసుక లారీలను రోడ్డుపైన అడ్డుకున్నారు. లారీలను అడ్డుకున్నప్పటికీ కాంట్రాక్టర్ కానీ, అధికారులు కానీ, స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీళ్ల ట్యాంకర్ తో దుమ్ము లేవకుండా ప్రధాన రహదారిపై ట్యాంకర్ తో నీళ్లు కొట్టాలని కోరుతున్నారు. అప్పటివరకు లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు.