calender_icon.png 5 February, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కానింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి

04-02-2025 11:08:03 PM

జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్..

కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో స్కానింగ్ కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేపట్టి నివేదికలను అందజేయాలని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం  గర్భస్త  పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ చట్టం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించుటకు గాను  చేపట్టు చర్యల గురించి ఈ  సమావేశములో చర్చించారు. జిల్లాలోని అన్నీ స్కానింగ్ కేంద్రాలను ప్రోగ్రాం అధికారి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నివేదికలు అందించాలని కమిటీ సభ్య్లులు సూచించారు.

మండల స్థాయిలో వైద్యాధికారులు, పర్య వేక్షక సిబ్బంది  ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు లింగ వివక్ష పట్ల క్షేత్ర స్థాయి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిచాలని, లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలను గుర్తించి చట్ట పరమైన చర్యలు చేపట్టాలని, ప్రతి స్కానింగ్ కేంద్రం జిల్లా అథారిటీలో రిజిష్ట్రేషన్ చేసుకునే విధంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఇట్టి  సలహా కమిటీలో  తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, న్యాయ నిపుణులు ఎం సంతోష్ కుమార్, న్యాయవాది, జిల్లా సమాచార మరియు పౌర సంబందాల శాఖ అధికారి ఎన్ భీమ్ కుమార్, ప్రోగ్రాం అధికారి డా.అనురాధ, సఖి కోఆర్డినేటర్ భారతి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిరీష, డాక్టర్ రేఖ, మాస్ మీడియా అధికారి వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.