11-03-2025 09:14:09 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల స్పెషల్ ఆఫీసర్(డీసీఓ) గా రామోహన్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. తర్వాత మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, నర్సరీలను ఆయన పరిశీలించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాల, బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీవో వెంకట్ నర్సయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.