అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు పదార్థాలు వాడటం మహాపచారమని రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల తయారీలో కల్తీ జరుగుతున్నట్లు అప్పట్లోనే గుర్తించానని దీక్షితులు తెలిపారు. కల్తీ గురించి అప్పటి ఈఓ, ఛైర్మన్ దృష్టికి తీసుకెళితే.. అక్రమ కేసులతో తనను వేధించారని ఆరోపించారు. లడ్డూల తయారీపై కొవ్వు పదార్థాలు వాడినట్లు ల్యాబ్ రిపోర్టులో తేలిందన్నారు. స్వామివారికి ప్రసాదాల నివేదనలోనూ అనేక దోషాలు జరిగాయని పేర్కొన్నారు. తిరుమలలో గత ఐదేళ్లపాటు మహాపాపం కొనసాగిందన్నారు. తిరుమలతో జరిగిన తప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ చేయించాలని రమణ దీక్షితులు కోరారు. గత ప్రభుత్వ హయాంలో తప్పు చసిన వారిని చట్టప్రకారం శిక్షించాలన్నారు.