24-03-2025 07:23:53 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి మధుసూదన్ రెడ్డి సహకారంతో లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వి మధుసూదన్ రెడ్డి, దేవ రాజేశ్వర్, రాజన్న, మల్లారెడ్డి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.