31-03-2025 07:09:47 PM
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ సోదరులు సోమవారం ఈద్గా వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ యొక్క ప్రాముఖ్యతను మత గురువులు బోధించారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం మైనారిటీలు రంజాన్ పండుగ సందర్భంగా నివాసాలలో పిండివంటలు, ప్రత్యేక వంటకాలు చేసి స్నేహితులు, బంధువులకు ఆతిథ్యాన్ని అందించారు. పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు మద్నూర్ మండల సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ రాజుల గ్రామంలో అహ్మద్ ఇంట్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తల, నాయకుల ఇండ్లకు వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.