calender_icon.png 16 October, 2024 | 3:42 PM

స్కాలర్ షిప్ లు మంజూరు చేయాలని ర్యాలీ

16-10-2024 01:14:31 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు డిగ్రీ జూనియర్ కళాశాలలకు రావాల్సిన స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరసనలో భాగంగా బుధవారం ప్రైవేటు కళాశాల యజమాన్యాల ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యజమాన్యల ప్రతినిధులు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.