calender_icon.png 24 October, 2024 | 7:51 AM

బంగ్లాదేశ్‌లో హిందువులను రక్షించాలి

12-08-2024 12:32:50 PM

దౌల్తాబాద్: బంగ్లాదేశ్ లో హిందువు లపై జరుగుతున్న దాడులు మారణకాండను నిరసిస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో స్వతంత్ర ఉద్యమకారులకు 30 శాతం రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనను హిందువులను లక్ష్యంగా చేసుకొని దేవాలయాలను, ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

దేశంలోని కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్  ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా హిందుత్వ జాతీయ వాదశక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు పబ్బ అశోక్ గుప్తా, మాజీ సర్పంచ్ ఆది వేణు గోపాల్,  బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, నాయకులు  తిరుపతి, కిషన్, కుమ్మరి నర్సింలు, స్వామి, మల్లేష్, నర్సింహారెడ్డి, స్వామి, ప్రభు, లాలు, రంజిత్, కనక రాములు, నాగరాజు, గణేష్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.