రోజు వ్యవధిలో 2 టైటిల్స్క్ష్ర డబుల్ బొనాంజ
రోజు వ్యవధిలో 2 టైటిల్స్
ముంబై: భారత యువ షట్లర్ రక్ష కందసామి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. 16 ఏళ్ల రక్ష రోజు వ్యవధిలో క్రొయేషియా, బెల్జియం టైటిల్స్ను కైవసం చేసుకుంది. ఆదివారం క్రొయేషియన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో రక్ష 21-9, 21-5తో ఇంగ్లండ్కు చెందిన లియోనా లీని చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది. ఇక శనివారం జరిగిన బెల్జియం జూనియర్ ఈవెంట్ ఫైనల్లో రక్ష 21-14, 10-21, 22-20తో గ్లోరియాను (జర్మనీ) ఓడించి చాంపియన్గా అవతరించింది.