calender_icon.png 22 October, 2024 | 6:49 PM

చిక్కడపల్లి సిఐగా రాజు నాయక్

22-10-2024 04:54:31 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బానోతు రాజు నాయక్ బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్ కు చెందిన నల్లగొండ జిల్లా భువనగిరి వాసి బానోతు రాజు నాయక్ నగరంలోని నారాయణగూడ, అంబర్‌పేట పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా, పలు పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలకు ఉగాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో తమను సంప్రదించాలని కోరారు. అదేవిధంగా  అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే సమాచారం అందించాలన్నారు.