16-03-2025 01:47:06 AM
లోహిత్ కల్యాణ్, రాజేశ్ కుంచాడా, జోషిత్ రాజ్కు మార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజు గారి దొంగలు’. హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్పై నడిమింటి బంగారు నాయుడు నిర్మించారు. లోకేశ్ రనాల్ హిటాసో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 21న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేశ్ రనాల్ మాట్లాడుతూ.. మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.