14-03-2025 12:00:00 AM
బచ్చన్నపేట, మార్చి 13: టీబీ ఎన్ఆర్కేఎస్(భవన నిర్మాణ అ నుబంధ రంగ సంఘం) బచ్చన్నపేట మండల కమిటీ అధ్యక్షుడిగా జేరిపోతుల రాజు ఎన్నికయ్యారు. గు రువారం మండలకేంద్రంలో కొమ్మగళ్ల కృష్ణ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు తూడి అంజయ్య ఆధ్వర్యంలో మండల కమిటీని ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. భ వన నిర్మాణ రంగాల కార్మికులు ఐక్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇన్సూరెన్స్ కంపెనీలకు సం బంధం లేకుండా ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల ఎల్లయ్య, దామర బాలనర్సయ్య, వేములవాడ వెంకటచారి, మేడిపల్లి వెంకటేష్, తుడుం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.