26-04-2025 12:39:57 AM
ఇందిరమ్మ ఇండ్ల పనుల లక్ష్యాలను పూర్తిచేయాలి
కలెక్టర్ బీ.యం.సంతోష్
గద్వాల, ఏప్రిల్ 25 ( విజయక్రాంతి ) : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికా సం పథకంలో ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, త్వరితగతిన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారు లను ఆదేశించారు.
శుక్రవారం ఐ.డి.ఓ.సి. కాన్ఫరెన్స్ హాల్లో రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రత్యేక డిసిసి బ్యాంకుల సమావేశం, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్.ఆర్.ఎస్ పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వ యం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఫ్రారంభంచడం జరిగందని తెలిపారు.
ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుండి 25,500 దరఖాస్తులు అందాయని, వాటిలో 8000 దరఖాస్తులను సెక్టర్ల వారీగా పారదర్శకంగా స్కూటీని చేయాల న్నారు.ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా అధికారులు ఆధార్, ఆదాయం , కుల దృవీకరణ పత్రాలతో పాటు అర్హత ప్రమాణాలను క్షుణ్ణంగా పాటించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల పనుల లక్ష్యాలను పూర్తిచేయాలి ...
ఇందిరమ్మ ఇండ్ల పనుల లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతిపై మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్,ప్రతి మండలంలో గ్రౌండింగ్, బేస్మెంట్,మార్క్ అవుట్, రీ వెరిఫికేషన్,పూర్తి వివరాలు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
మంజూరైన ఇండ్లలో 10 శాతం ఇండ్లకు బేస్మెంట్ పనులు ఒక వారం లోపే పూర్తయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం మొదలయ్యేలోగా మంజూ రు ప్రక్రియ పూర్తి చేసి,నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు,ఇంచార్జ్ ఎల్డీయం శ్రీనివాస రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఒలు తదిత రులు పాల్గొన్నారు.-------------------------------