calender_icon.png 23 September, 2024 | 2:46 AM

వచ్చేనెల 12న ఉప్పల్ స్డేడియంలో రాజీవ్ విగ్రహావిష్కరణ

23-09-2024 12:50:09 AM

  1. హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన  మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 12న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆవిష్కరిస్తారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వీ హనుమంతరావు పేర్కొన్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్, ఎంపీ విశ్వనాథన్‌తో కలిసి వీహెచ్ ఆదివారం ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి, విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో పూజలు చేశారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ చేసిన సంస్కరణలే దేశంలో ఇప్పటికీ అమలువుతున్నాయన్నారు. రాజీవ్ విగ్రహావిష్కరణకు ప్రియాంక గాంధీ హాజరయ్యేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు వీహెచ్ తెలిపారు.  కాంగ్రెస్ నాయకులు ఎం పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, శంభుల శ్రీకాంత్, జగదీశ్, ఆది శ్రీనివాస్, అక్బర్ యూసుఫ్, దేవరాజ్, శ్రీనివాస్, బస్వరాజు, సురేందర్, రామకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.