చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వేట్టయాన్ ప్రమోషన్ లో తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడడానికి నిరాకరించారు. మీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త, తిరుపతి లడ్డూపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి రజినీ మాత్రం తన స్టైల్ లో "సారీ నో కామెంట్స్" అని సమాధానం ఇచ్చారు. తాజాగా తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో కార్తి లడ్డూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
"లడ్డూ కావాలా నాయనా" అని ఈవెంట్ హోస్ట్ అతనిని అడిగినప్పుడు, కార్తీ మాట్లాడుతూ, "లడ్డూ గురించి చర్చించవద్దు. ఇది సున్నితమైన అంశం." అన్నారు. రజనీకాంత్ ఒక ప్రకటన చేయడం ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదనుకుంటున్నారని, అందువల్ల అతను ఈ సమస్యపై మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై వివాదం నెలకున్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో ఆవునూనె, పందికొవ్వుతో పాటు జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడినట్లు ఆరోపణలు బయటకు రావడంతో మొత్తం హిందూ ప్రవాసులు షాక్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.