దర్శకుడు శామ్ ఆంటోన్
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్ల ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శామ్ ఆంటోన్ బడ్డీ టీమ్తో వర్క్ ఎక్స్పీరియన్స్ను, ప్రేక్షకాదరణ తీరును మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాట ల్లోనే.. “బడ్డీ’ మూవీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా బాగుందని పిల్లలు, పెద్దలు చెప్తున్నారు. కామెడీ, యాక్షన్తోపాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా వినోదం పంచుతోంది. తమిళ్ మూవీ ‘టెడ్డీ’లోని ఒక లైన్ మాత్రమే తీసుకొని పూర్తి కొత్త కథతో ఈ మూవీ తీశాం. అయితే, ‘బడ్డీ’ కోసం రాజమౌళి ‘ఈగ’ రెఫరెన్స్ తీసుకున్నా. యంగ్ హీరో అయితే బాగుంటుందని అల్లు శిరీష్ను సంప్రదిస్తే ఆయన కథ విని ఓకే చేశారు. హిప్హాప్ ఆది హీరోగా తర్వాతి సినిమా చేయబోతున్నా. నాకు తెలుగు సినిమాలు ఇష్టం. పూర్తి తెలుగు చిత్రం తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నా. దర్శకుడిగా ఒకే జానర్కు పరిమితమై ఉండలేను. ఏ జానర్ అయినా చేస్తా” అన్నారు.