calender_icon.png 16 October, 2024 | 7:01 PM

బెంగళూరు, చెన్నైకి వాన ముప్పు

16-10-2024 03:43:30 AM

బెంగళూరు, అక్టోబర్ 15: ఈశాన్య రుతుపవనాలతో వానలు దంచి కొడుతుండటంతో దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై తడిసి ముద్దవుతు న్నాయి. భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. బెంగ ళూరులో ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమ త్తమైంది. బుధవారం నగరంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.

ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేయాలని, అందు కు కంపెనీలు ఏర్పాట్లుచేసు కోవా లని సూచించింది. చెన్నైలో కూడా పరిస్థితి అలాగే ఉన్నది. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమా దం ఉన్నదని ప్రభుత్వం హెచ్చరిం చింది.  దీంతో ప్రజలు స్వచ్ఛందం గా రక్షణ చర్యలు తీసుకొంటు న్నారు. గత అనుభవాల దృష్ట్యా విలువైన వస్తువులు, వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో దాస్తున్నారు.