26-04-2025 03:16:15 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు కలిసి రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ వేదికగా రెండో రోజు జరుగుతున్న భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆయన శనివారం హైదరాబాద్ వచ్చారు. సాయంత్రం 6 గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం హెచ్ఐసీసీ వేదికగా భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ సర్కార్ భారత్ సమ్మిట్-2025 నిర్వహిస్తోంది.