calender_icon.png 22 October, 2024 | 9:04 AM

శ్రీచక్రం ప్రేరణతో ‘రహస్యం ఇదం జగత్’

22-10-2024 12:00:00 AM

రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారాగణంగా తెరకెక్కనున్న చిత్రం ‘రహస్యం ‘ఇదం జగత్’. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో రావినూతుల పద్మ, హిరణ్య నిర్మిస్తున్నారు. సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ప్రత్యేకంగా సమావేశమైంది.

ఈ సందర్భంగా దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘సైన్స్ ఫిక్షన్‌కు మైథాలాజికల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. శ్రీచక్రం ప్రేరణతో ఈ కథను తయారుచేశాను. ఇండియన్ మైథలాజీ ప్రేరణతో ఈ కథను తయారుచేసుకొని, పూర్తిగా అమెరికాలో చిత్రీకరించాం’ అన్నారు. హీరోయిన్లు మానస, స్రవంతి పత్తిపాటి, గీత రచయితలు రాంబాబు గోసాల, రమేశ్, సంగీత దర్శకుడు గ్యానీ, చిత్రబృందం కార్యక్రమంలో పాల్గొన్నారు.