ఇరానీ కప్
ముంబై: దేశవాలీ టోర్నీ ఇరానీ కప్లో రంజీ ట్రోఫీ చాంపియన్స్ ముంబై జట్టుకు అజింక్యా రహానే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 1న ప్రారంభం కానున్న ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియాతో లక్నో వేదికగా ముంబై మ్యాచ్ ఆడనుంది. బంగ్లాతో రెండో టెస్టు సం దర్భంగా సర్ఫరాజ్కు చోటు దక్కకపోతే ఇరానీ కప్లో పాల్గొనే అవకా శముంది. ఇక అక్టోబర్లో కివీస్తో టీ20 సిరీస్ ఆడనుండడంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్తో పాటు శివమ్ దూబే ఇరానీ కప్కు దూరమవ్వనున్నారు.