29-04-2025 12:00:00 AM
ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాం తి): విద్యార్థులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేయడం చట్ట వ్యతిరేకమని, ర్యాగింగ్ చేయడం వల్ల సున్నిత మనస్తత్వం కలవారు దేశంలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ వైద్య కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థులకు ర్యాగింగ్, మత్తు పదార్థాల వాడకం తదితర వాటిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవా రం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ ను ప్రోత్సహించకుండా ఉండాలని తెలిపారు. ర్యాగింగ్పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య విద్యార్థులు డ్రగ్స్కు గంజాయి లాంటి మత్తు పదార్థాల కు అలవాటు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలకు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా షీ టీం బృం దం అందుబాటులో ఉంటూ సరైన సేవలను అందజేస్తుందని హామీ ఇచ్చా రు. మహిళలు విద్యార్థినిలు ఎలాంటి అవసరం ఉన్న షీ టీం బృందాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, రెండో పట్టణ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర రావు, కళాశాల డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, కళాశాల అధ్యాపకులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.