calender_icon.png 5 October, 2024 | 9:00 PM

సిద్దిపేట ప్రభుత్వ ప్లీడర్‌ గా రఫీయుద్దీన్‌

05-10-2024 05:33:19 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులకు 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులు అయ్యారు. సిద్దిపేటకు చెందిన మహమ్మద్ రఫీయుద్దీన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా సీనియర్ జూనియర్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజ నరసింహ, కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , మాజి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పూజల హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు నర్సా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.