calender_icon.png 23 September, 2024 | 4:02 PM

56 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

20-09-2024 12:00:00 AM

కొత్తగూడెం, సెప్టెంబర్ 19: రేషన్ దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉం చిన 56 క్వింటాళ్ల బియ్యాన్ని టేకులపల్లి పోలీసులు, సివిల్ సప్లు అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో బేతంపూడి రేషన్ డీలర్ అక్రమంగా తన ఇంట్లో బి య్యం నిల్వచేశాడన్న సమాచారంతో టేకులపల్లి ఎస్సై సురేశ్, సివి ల్ సప్లు సిబ్బంది బుధవారం రాత్రి తనిఖీ చేశారు. ఉండాల్సిన నిల్వకంటే 9 క్వింటాళ్ల బియ్యం ఎక్కువ ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సులానగర్‌లో దాడులు చేసి 47 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

సులానగర్ రేషన్ డీలర్ గత ఏడాది ఇదే రీతిలో అక్ర మ నిల్వ ఉంచడంతో 6 (ఎ) కేసు నమోదు చేసి బేతంపూడి డీలర్‌కు అదనపు బాద్యతల్ని అప్పగించారు. బేతంపూడి, సులానగర్ చౌకదుకాణాలు నిర్వహిస్తున్న డీలరు ఒక్కరే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో బేతంపూడి దుకాణాన్ని టేకులపల్లి డీలర్‌కు అప్పగించగా, సులానగర్ రేషన్ దుకాణం బాధ్యతలు బొమ్మనపల్లి డీలర్‌కు అప్పగించినట్టు రెవె న్యూ అధికారులు తెలిపారు.