సూర్యాపేట, అక్టోబర్ 16 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ పరిధిలోని ఎర్రపహడ్ ఎక్స్రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తుంగతుర్తి సీఐ శ్రీనునా యక్ తెలిపిన వివరాల ప్రకారం.. నూతన్కల్ ఎస్సై మహేందర్, స్పెష ల్ బ్రాంచ్ ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి ఎర్రపహాడ్ ఎక్స్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మినీ వ్యాన్లో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుబడినట్టు తెలిపారు. నూతనకల్కు చెందిన పొన్నం విజయ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణ చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా ఎస్సై మహేందర్, స్పెష ల్ బ్రాంచ్ ఎస్సై రవికుమార్ హెచ్చరించారు.