మేడిపల్లి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని కోహినూర్ పాల ఉత్పత్తి కేంద్రంలో కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నారని రాచకొండ ఎస్వోటీ పోలీసులు సమాచారం అందుకున్నారు. మంగళవారం కేంద్రంలో ఆకిస్మక దాడులు నిర్వహించారు. సుమారు 300 కిలోల కల్తీ పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్వోటీ అధికారులు వెల్లడించాల్సి ఉన్నది.