11-04-2025 01:35:50 AM
పెన్ పహాడ్ : రైతులు తమ ధన్యాన్ని కల్లాల వద్దనే తాలు లేకుండా ఆరబోసుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని తహసీల్దార్ లాలునాయక్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ( చీదేళ్ల ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ఏఈఓ పరిశీలించిన నిబంధనల ప్రకారమే రైతులకు సంబందించిన ధన్యాన్ని కాంటాలు వేసి అన్ లైన్ లో పొందపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, బీఆర్ఎస్ నాయకులు తూముల ఇంద్రసేనా రావు, ఏఓ అనిల్ కుమార్, ఏఈఓ స్వప్న, సీఈఓ సోమ్లా, డైరెక్టర్ గుడెపూరి రవి, దాసరి శ్రీను, ఒగ్గు గోపి, విజయకుమార్, సూర్యనారాయణ, వీరబోయిన లింగయ్య లక్ష్మీకాంతారావు, ఒగ్గు సైదులు తదితరులు ఉన్నారు.