calender_icon.png 28 September, 2024 | 4:49 PM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం

28-09-2024 01:13:42 AM

పాఠశాల సిబ్బందికి కలెక్టర్ ఆదేశం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ఆదిలాబాద్ రూర ల్ మండలంలోని అంకోలి అంగన్‌వాడీ కేం ద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వివరాలు తెలుసుకు న్నారు. చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు.

అనంతరం గ్రామంలో ని ర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలి ంచారు. సచ్ఛతా హీ సేవాలో భాగంగా అం కోలి పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటా రు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పద్మ భూషణ్, డీఆర్డీవో సాయన్న, డీఎల్పీలవో ఫణీంద్ర, ఎంపీడీవో నాగేశర్‌రెడ్డి ఉన్నారు.