కూసుమంచి, సెప్టెంబర్ 19: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురంలో భారీ కొండ చిలువను రైతులు హతం చేశారు. గ్రామస్థులు భూక్యా వెంకట్రాములు తన పత్తి పొలంలో పని చేస్తుండగా కొండ చిలువ కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన రైతు కేకలు వేయడంతో పక్కనే ఉన్న రైతులు వచ్చి కొండ చిలువను చంపారు. అది 15 అడుగుల పొడవు, 40 కిలోల బరువు ఉందని రైతులు తెలిపారు.