10-04-2025 06:58:37 PM
కాటారం (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ పుట్ట మధు పరామర్శించారు. గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో రంగు లక్ష్మీనారాయణ, రోడ్డు ప్రమాదంలో పస్తం ఉప్పలయ్యలు మృతి చెందారు. గురువారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, బిఆర్ఎస్ మండల ఇన్చార్జ్ జోడు శ్రీనివాస్, పంతకాని సదువలి, కొండగొర్ల వెంకటస్వామి, శ్రీలక్మి చౌదరి, జక్కు శ్రావణ్, వంగల రాజేంద్రచారి చీమల వంశీ, తదితరులు పాల్గొన్నారు.