calender_icon.png 13 October, 2024 | 10:47 AM

చరిత్ర లిఖించడానికి పుష్ప వస్తున్నాడు!

09-10-2024 12:00:00 AM

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదలై, సంచలన విజయాన్ని నమోదు చేసింది ‘పుష్ప: ది రైజ్’. దీంతో తొలుత అనుకున్న ‘పుష్ప2’ కథకు డైరెక్టర్ సుకుమార్ మరిన్ని హంగులు జోడించి ‘పుష్ప2: ది రూల్’ను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. నిర్మాణానంతర పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 

ఇదిలా ఉండగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ గురించి చిత్రబృందం తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. “పుష్ప2’ ప్రథమార్థం ఫుల్ ఫైర్‌తో పూర్తయింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించి చరిత్రను లిఖించడానికి పుష్ప వస్తున్నాడు. భారతీయ సినిమాకు ఇదొక కొత్త అధ్యాయం. డిసెంబర్ 6న, 2024 పుష్ప: ది రూల్‌” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.

పార్ట్-2 క్లుమైక్స్‌లో మూడో భాగానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చూపిస్తారని చర్చ జరుగుతోంది. రెండు, మూడేళ్ల తర్వాత గానీ ‘పార్ట్3’ పట్టాలపైకి ఎక్కే పరిస్థితి లేదు. రష్మిక కథానాయిక కాగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.