అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప-2’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్ ప్రెస్మీట్లో నిర్మాతలు తెలియజేసిన విషయం తెలిసిందే.
శనివారం అభిమానులను ఆనందంలో ముంచెత్తే విషయం చెప్పారు. ‘పుష్ప-2’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఇండియాలో 6500 స్క్రీన్లు, ఓవర్సీస్లో 5000 స్క్రీన్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకూ ఇంత పెద్ద ఎత్తున ఏ ఇండియన్ సినిమా విడుదల కాలేదని.. పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.