కాంగ్రెస్పై అమిత్ షా విమర్శలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడిన విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో పట్టుబడిన డ్రగ్స్ రాకెట్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని షా ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీ.. యువతను విద్య, క్రీడలు, ఆవిష్కరణల వైపు నడిపిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ యువతకు డ్రగ్స్ అలవాటు చేసి వారిని చీకటి ప్రపంచంలోకి నెట్టేందుకు చూస్తోందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ తన రాజకీయ పరపతిని ఉపయోగించుకొని డ్రగ్స్ రవాణా చేస్తోందని షా ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో యువత డ్రగ్స్కు బానిసగా మారిందన్నారు. ఇప్పుడు ఆ కల్చర్ను ఢిల్లీలోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారని.. దీనిని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ జరగనివ్వదని షా స్పష్టం చేశారు.