26-04-2025 12:00:00 AM
నిర్మల్ ఏప్రిల్ 25 (విజయక్రాంతి): యాసంగిలో రైతులు పండించిన జొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతోనే జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయడం జరిగిందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సారంగాపూర్ మండలంలోని చించోలి బోరిగం ఆలూరు యాకర్పల్లి బీరవెల్లి జాం కౌట్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటాలకు రూపాయలు 37 50 రూపాయలు చెల్లిస్తున్నందున రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి కృషి.
నిర్మల్ పట్టణంలోని ఆయా కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పేరదర్శిని నగర్ సాగరకలలో సందర్శించి చేపట్టి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నార